ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఆంధ్రప్రదేశ్ యంగ్ డైనమిక్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తక్కువ కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మంచి మంచి పథకాలు పెట్టి ప్రజలపై తనకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ప్రజలకు మంచి చేస్తూ దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ముందుగా కేంద్రమంత్రి అమిత్ షాతో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం, మూడు రాజధానులు, వరద సాయం, మిగిలిన అంశాలపై విన్నవించారు.. దాదాపు గంటసేపు ఈ భేటీ కొనసాగింది. బుధవారం ఉదయం కేంద్ర జలశక్షి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను జగన్ కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.. సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడంతో పాటూ పెండింగ్ నిధులు కూడా మంజూరు చేయాలని కోరారు. జగన్ ఢిల్లీ పర్యటనను లోకేష్ టార్గెట్ చేశారు.. ఓపీనియన్ పోల్ మొదలు పెట్టారు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఈ విధంగా ఒక   సంచలన పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్  ఢిల్లీ పర్యటనపై ఓపీనియన్ పోల్ మొదలు పెట్టడం జరిగింది. జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న రహస్యం ఈ కింది వాటిలో ఏది అంటూ మూడు ఆప్షన్‌లు ఇచ్చారు.
1) కేసుల మాఫీ కోసమా?..
2) బాబాయ్ హత్యకేసు కోసమా?..
3)ప్రత్యేకహోదా తేవడం కోసమా?

అంటూ ప్రశ్నించారు. వారం పాటూ ఈ ఓపీనియన్ పోల్ కొనసాగనుంది. ఇక నారా లోకేష్ పెట్టిన ఈ పోల్ పై పలువురు వైసీపీ అభిమానులు కోప్పడుతుండగా తెలుగుదేశం దేశం అభిమానులు అందుకు లోకేష్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫోలో అవ్వండి. ఇంకా మరెన్నో రాజకీయ విషయాలు గురించి తెలుసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: