
ఈ ఘటనలో 32మంది చనిపోయినట్టుగా అధికారులు వెల్లడించారు. బస్సులో ఉన్నవారు చాలా కొద్ది మంది తీవ్రగాయాలతో బయటపడ్డారు, వారి పరిస్థితి విషమంగానే ఉంది. మాలి లో గత కొన్ని నెలలుగా ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. వాళ్ళు చేసే దాడులకు లెక్కాపత్రం లేకుండా ఉంది. ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రభూతాలు అక్కడ పెట్రేగిపోతున్నాయి. మాలి లో ప్రభుత్వం పై మిలిటరీ తిరుగుబాటు కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెపుతున్నారు. కేవలం 16 నెలలలో ప్రభుత్వంపై రెండు సార్లు తిరుగుబాటు జరిగింది. అటువంటి బలహీన ప్రభుత్వం ఉండటంతో ఉగ్రభూతకు కూడా రెచ్చిపోతున్నాయి.
తాజాగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఎన్నాళ్ళు ఉంటుంది తెలియదు. తాజా దాడిలో పనులకు వెళ్తున్న మహిళలు ఉన్న బస్సు కావడం చేత బాధితులు ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఈ బస్సు సొంగో గ్రామం నుండి వారానికి రెండు సార్లు బండియాగరా లోని మార్కెట్ కు వెళ్తుంది, అది తెలుసుకొని తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దేశంలో ప్రభుత్వం స్థిరంగా లేకపోవడం తో ఉగ్రభూతాలు యువతను లేదా నేరప్రవృత్తి ఉన్న వారిని తమలో చేర్చుకొని వాళ్ళ ద్వారా ఈ పనులు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వంకతో మరోదేశం తీవ్రవాదుల హస్తగతం కాకుండా ఉంటె అదే చాలు.