జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పార్టీ కార్యకర్తలు, నేతలు చెప్పిన సలహాలను పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు.. దీంతో కూటమిలో భాగంగా జనసేన పార్టీకి 21 స్థానాలను కేటాయించడం జరిగింది.. అయితే ఇందులో ఒకటి , రెండు స్థానాలలో పెండింగ్ ఉన్నప్పటికీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించారు.. దీంతో కొంతమంది నేతలలో అసంతృప్తి కూడా నెలకొంది..దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. అదేమిటంటే రాయలసీమలోని  రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిని మార్చేసినట్టుగా తెలుస్తోంది..


ఇండియా హెరాల్డ్ కి అందిన సమాచారం మేరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారని పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చినట్టుగా తెలుస్తోంది.. రైల్వే కోడూరు అభ్యర్థి అరవ శ్రీధర్ పేరు ఈ రోజున మధ్యాహ్నం ప్రకటించారు జనసేన పార్టీ.. యనమల భాస్కర్ స్థానంలో శ్రీధర్ పేరుని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అందుకు సంబంధించి ఒక నోటును కూడా రిలీజ్ చేశారు.. క్షేత్రస్థాయి నివేదికలలో  జిల్లా నేతల అభిప్రాయాలను సైతం పరిగణంలోకి తీసుకున్న తర్వాతే ఈ నోట్ ను విడుదల చేశామంటూ తెలియజేశారు పవన్ కళ్యాణ్.


యనమల ఇంకా ప్రచారంలోకి వెళ్లకముందే ఈ మార్పు చోటు చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఈ సమయంలోనే ముక్కవారిపల్లె గ్రామ సర్పంచ్ గా ఉన్నటువంటి అరవ శ్రీధర్ మూడు రోజుల క్రితమే టీడీపీ నుంచి జనసేనలోకి చేరడం గమనార్హం.. ఇండియా హెరాల్డ్ కు వచ్చిన సమాచారం మేరకు.. రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థి యనమల భాస్కర్ పైన సర్వేలో సానుకూలత రాకపోవడంతో పాటు మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకపోవడం వల్లే అభ్యర్థిని మార్చినట్టుగా తెలుస్తోంది... మొత్తానికి అయితే చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ మరో త్యాగం చేసినట్లు తెలుస్తోంది


ఇటీవలే ఆళ్లగడ్డ సీటును కూడా టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్ధ ప్రసాద్ కి కూడా కేటాయించారు.. మాన్యం పాలకొండ స్థానం పైన కూడా నుంచి వచ్చిన వారికి సీటు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.  మరో కొద్ది రోజుల్లో ఆ ప్రకటన కూడా వెలువడబోతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: