
గత వైసీపీ ప్రభుత్వం కొన్ని గనులపై 255 కోట్ల రూపాయల జరిమానాలు విధించిందని, ఆ మొత్తాన్ని వసూలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఉందని యాదవ్ గుర్తు చేశారు. పెనాల్టీ ఉన్న గనులను తిరిగి తెరిచి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో వందల గనులు ఉన్నప్పటికీ, కేవలం 30 గనులను మాత్రమే ఎందుకు పునఃప్రారంభించారని ప్రశ్నించారు. ప్రస్తుతం లక్ష్మీ క్వార్జ్, ఫిని క్వార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ద్వారా మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయని, ఇది అక్రమాలకు సంకేతమని విమర్శించారు.
సైదాపురంలో గంజాయి బ్యాచ్ తిరుగుతూ ప్రజలను, ముఖ్యంగా మహిళలను భయాందోళనకు గురిచేస్తోందని యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రజల భద్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్, సామాజిక సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారని, న్యాయస్థానంపై గౌరవం ఉన్న కాకాణి న్యాయం కోసం పోరాడతారని యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు