
2020లో వైసీపీ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినప్పుడు సీవోఏ అనుమతి తీసుకోలేదని షర్మిల విమర్శించారు. అనుమతి లేకుండా విద్యార్థులను ఎన్రోల్ చేయడం ద్వారా గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి సీవోఏతో సంప్రదింపులు జరపకుండా వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డి మౌనం వహించారని ఆమె ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిన వైసీపీ పాలనలో ఈ తప్పిదం జరిగినప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఈ సమస్యను సరిదిద్దడంలో విఫలమవుతోందని ఆమె విమర్శించారు.
గత ఏడాది కాలంగా విద్యార్థులు సీవోఏ అనుమతి కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఎటువంటి చర్యలు చేపట్టలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్రువపత్రాలు లేకుండా విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడుతున్నాయని, దీనికి ప్రభుత్వం తక్షణ పరిష్కారం చూపాలని ఆమె కోరారు. ఈ సమస్య వల్ల విద్యార్థుల కెరీర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే సీవోఏతో చర్చలు జరిపి, విశ్వవిద్యాలయానికి అనుమతి తెచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు