ఇలా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బాగా రాణిస్తున్న పృథ్వీ షా కు ఇటీవల ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలె లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా కు జరిమాన పడిన తెలుస్తుంది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. లెవల్ వన్ నేరానికి పాల్పడటం తో ఇక అలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి లోని ఆర్టికల్ 2.2 కింద లెవెల్ వన్ నేరానికి పాల్పడినట్లు అటు ఓపెనర్ పృథ్వీషా అంగీకరించాడు.
ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ తుది నిర్ణయం మేరకు జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఇటీవల సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. అయితే పృథ్వీషా ఐపీఎల్లో ప్రవర్తన నియమావళిని ఎక్కడ ఉల్లంఘించాడు. ఏం చేశాడు అనే విషయంపై మాత్రం అటు ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టతను ఇవ్వకపోవడం గమనార్హం. కాగా ఇటీవలే లక్నో తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన పృథ్వీషా తీవ్రంగా నిరాశ పరిచాడు. కాగా ఈ మ్యాచ్లో ఢిల్లీ కాపిటల్స్ ఓటమి చవిచూసింది. ఆరు పరుగుల తేడాతో లక్నో జట్టు విజయం సాధించడం గమనార్హం..