క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రారంభమైంది. ఈ క్రమం లోనే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితం గా సాగుతుంది. ఇక క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఊహించినట్లు గానే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అయితే ఇక నేడు మరో ఆసక్తికర పోరు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.


 అయితే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లోనే ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ప్రస్తుతం జోరు మీద కనిపిస్తుంది గుజరాత్ టైటాన్స్ జట్టు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గత ఏడాది లాగానే ఈసారి కూడా అద్భుతం గా సత్తా చాటుతూ ఉంది అని చెప్పాలి. బౌలింగ్ విభాగం లో బ్యాటింగ్ విభాగం లో కూడా సత్తా చాటుతూ తిరుగు లేదు అని నిరూపిస్తుంది. అదే సమయం లో ఇక పంత్ లేకపోవడంతో అటు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో బలిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం మొదటి మ్యాచ్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది అన్న విషయం తెలిసిందే. కాగా రెండో మ్యాచ్లో బోనీ కొట్టాలి అనే కసితో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.



 అయితే హార్దిక్ పాండ్యా నేతృత్వంలో తొలి మ్యాచ్ గెలిచిన గుజరాత్ జట్టులో ఇక ఇప్పుడు డేవిడ్ మిల్లర్ లాంటి ఎంతో విధ్వంసకరమైన ఆటగాడు కూడా చేరడంతో జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తుంది. ఇక ఢిల్లీ జడ్డులో నోర్జె, ఎంగిడి చేరికతో ఆ జట్టు కూడా బలంగానే కనిపిస్తుంది. ఒకవేళ మిచెల్ మార్ష్ రానించాడు అంటే ఢిల్లీ జట్టుకు తిరుగు ఉండదు అని చెప్పాలి. దీంతో ఇక నేడు ఈరోజు హోరాహోరీ పోరు జరగబోతుంది అని తెలుస్తుంది. మరి రెండో మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl