ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది . ఈ క్రమంలోనే నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరు అటు అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. అయితే ప్రతి మ్యాచ్ లో కూడా భారీ స్కోర్లు నమోదు అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. దాదాపు ఇక ప్రతి మ్యాచ్ లో 200 పైగానే ఇరుజట్లు స్కోరును చేస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఇటీవల లక్నో, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అయితే మరింత భారీ స్కోరు నమోదయింది. ఏకంగా మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టింది.



 ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 257 పరుగులు చేసింది లక్నో జట్టు.  ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇక ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అయితే ఆ తర్వాత భారీ టార్గెట్ తో బరీలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కేవలం నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 56 పరుగుల తేడాతో లక్నో చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది పంజాబ్ కింగ్స్ జట్టు. ఇదిలా ఉంటే ఇక లక్నో జట్టు 257/5 స్కోర్ నమోదు చేసిన నేపథ్యంలో ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు నమోదైన భారీ స్కోర్ ఏంటి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది తెలుసుకోవడానికి క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.


ఆ వివరాలు చూసుకుంటే.. 2013లో పూణే జట్టుపై ఆర్సీబీ చేసిన 263/5 పరుగులు ఇప్పటివరకు ఐపీఎల్లో టాప్ హైయెస్ట్ స్కోర్ గా కొనసాగుతుంది.  తర్వాత ఇటీవల పంజాబీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో లక్నో చేసిన 257/5 టాప్ స్కోరుగా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక తర్వాత 2016లో రాజస్థాన్ పై చెన్నై 248 /3,  2018లో కోల్కతా పంజాబ్ పై 245/6, 2008లో పంజాబ్ పై చెన్నై 240/5, 2023లో కోల్కతా పై చెన్నై 235 / 4, 2021 లో హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ 235 / 9 హైయెస్ట్ స్కోర్లుగా కొనసాగుతున్నాయి. మరి లక్నో చేసిన హైయెస్ట్ పరుగుల రికార్డును ఈ ఏడాది ఎవరైనా బ్రేక్ చేస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl