ఒకరోజు బాలచందర్ దర్శకత్వం వహించిన "మనదిల్ ఉరుది వెండుమ్" అనే సినిమాకు సంబంధించి ఒకే ఒక్క సందర్భం చెప్పి పదహారు పాత్రలను కలిగిన కథ రాయమన్నాడట. వివేక్ కేవలం ఒక్క రాత్రిలోనే కథ రెఢీ చేశారట. అంత నిబద్దత పని అంటే వివేక్ కి, అలా అదే సినిమాలే మొదటిసారి నటించే అవకాశాన్ని పొందాడు వివేక్. అప్పటి నుండి అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చినా ఏవీ సరైన గుర్తింపును తీసుకురాలేకపోయాయి. ఆ తర్వాత 2003 లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రంలో నటించడం ద్వారా అందరికీ వివేక్ గురించి తెలిసింది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.
ఈయనకు సమాజ సేవ అంటే కూడా చాలా బాధ్యత ఉండేది. 2011 లో గ్లోబల్ వార్మింగ్ కు వ్యతిరేకంగా కోటి మొక్కలు నాటాలని అనుకున్నాడు. దీనికి గ్రీన్ గ్లోబ్ అనే పేరు పెట్టారు. కానీ వివేక్ 33.23 లక్షల మొక్కలు నాటడం మరియు ఇతరుల దగ్గర నాటించాడు. ప్రమాదకరమైన కరోనా వైరస్ సమయంలోనూ అందరికీ దాని పట్ల అవగాహన కల్పించారు. వ్యాక్సిన్ అవసరాన్ని కూడా తెలియాచేశాడు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలతో వివేక్ ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యాడు. అలా వివేక్ హృదయ సంబంధిత వ్యాధితో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరణించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి