అది కూడా ఒక ప్రణాళిక ప్రకారం వెళితేనే, ప్రస్తుతానికి వికెట్ కోల్పోకుండా 77 పరుగులు చేసిన ఇంగ్లాండ్ టీం కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నట్లే లెక్క. అయితే ఏ మాత్రం తిరకాసు జరిగినా రెండవ టెస్ట్ లాగా ఇంగ్లాండ్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇండియా బౌలర్లు మొదటి ఓవర్ నుండే అటాకింగ్ చేయడం ఫలితాన్ని ఇవ్వొచ్చు. ముఖ్యంగా బుమ్రా మరియు ఉమేష్ యాదవ్ చేత ఎక్కువ ఓవర్లు వేయించడం మంచిది. ఇప్పటికే ఉమేష్ యాదవ్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లతో ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఉమేష్ యాదవ్ తీసిన వికెట్లలో రూట్, మలన్, ఓవర్ టన్ లు ఉన్నారు. రూట్ మరియు మలన్ మంచి టచ్ లో ఉన్నారు. కాబట్టి వీరు వచ్చినప్పుడు ఉమేష్ యాదవ్ కి బంతి అప్పగించాలి.
మొదటి సెషన్ లో వికెట్ తీయలేకపోతే గెలుపు అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి మొదటి సెషన్ లోనే వికెట్లను తీసి ఇంగ్లాండ్ ను మరింత ఒత్తిడికి గురి చేయాలి. కొన్ని వికెట్లు పడితే ఆ తర్వాత ఇంగ్లాండ్ గెలుపు కోసం ప్రయత్నించగా డ్రా చేసుకోవడానికి పోరాడుతుంది. ఇదే ప్రయత్నంలో వికెట్లను చేజార్చుకుని సిరీస్ లి ఇండియా ఆధిక్యం సాధించేందుకు కారణమవుతుంది. మరి ఇంకాసేపట్లో జరగనున్న మ్యాచ్ లో ఏమి జరగనుందో చూడాల్సిన అవసరం ఉంది. మరి కోహ్లీ అండ్ కో ఈ టెస్టు గెలుస్తుందా ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి