తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గం ములుగులో ఎక్కువగా ఉన్న గిరిజనులకు అండగా నిలవడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ లో తన నియోజకవర్గ ప్రజలు కష్టాలు పడవద్దు అని భావించిన ఆమె అక్కడికి నిత్యావసర సరుకులను పెద్ద ఎత్తున చేరవేస్తూ తానే స్వయంగా తిరుగుతున్నారు. 

 

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సీతక్క చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి   కూడా అభినందించారు. “కరోనా కష్టకాలంలో కొండకోనలు దాటి దారిడొంక లేని గూడేలకు వెళ్లి చేస్తున్న సేవ అద్భుతం. వలస కూలీలకు అండగా నిలిచిన తీరు అనిర్వచనీయం. వివిధ రంగాల్లో సేవలందించి చరిత్రలో నిలిచిన మహిళల గురించి విన్నాం.. చదివాం..సీతక్కను కళ్లారా చూస్తున్నాం. భావితరాలకు సీతక్క మార్గదర్శి.” అంటూ ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: