ఇక గత రెండేళ్ళు నుంచి కరోనా కల్లోలం సృష్టించింది.ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎందరో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.ఇండియాలో కూడా కరోనా వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు.అయితే అందువల్ల పిల్లలను పాఠశాలకు పంపడానికి తల్లి దండ్రులు భయపడ్డారు. దీంతో రెండు సంవత్సరాల పాటు అన్నీ విద్యాసంస్థలు కూడా మూత పడ్డాయి.ఇక ఈ ఏడాది పాఠశాలలు మొదలైన సమయం అనేది చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో సిలబస్ ను కూడా తగ్గించారు. కేవలం 70 శాతం మాత్రమే పరీక్షలకు తీసుకుని మెయిన్ పరీక్షలను నిర్వహించారు. ఇటీవలే తెలుగు రాష్ట్రాలలో పది ఇంకా అలాగే ఇంటర్ పరీక్షలు కూడా పూర్తీ అయ్యాయి. ఏపీ లో పది రిజల్ట్స్ ను కూడా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.అయితే తెలంగాణాలో మాత్రం ఈ నెల ఆఖరున ఫలితాలను విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.. 


ఇక పోతే ఏపీ లో విడుదల అయిన ఫలితాలు అయితే అంత ఆశాజనకంగా లేవు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు చాలా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. చాలా మంది ఫెయిల్ అవ్వడంతో ఏపీ సర్కారు కు నిరాశ మిగిలింది.దాంతో ఏపీ సర్కార్ వారు ఫెయిల్ అయిన వాళ్ళను మళ్ళీ పాస్ అయ్యేలా అన్నీ చర్యలను తీసుకుంటున్నారు.ఈ మేరకు పది ఫెయిల్ అయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్.. ఈ నెల 13 వ తారీఖు నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తీ అయ్యేవరకు కూడా ప్రత్యేక క్లాసులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.జులై నెలలో సప్లిమెంటరీ పరీక్షలు ఉండటం తో ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా రోజుకు రెండు సబ్జెక్టులను భోధించాలని కూడా ఉపాద్యాయులకు సూచించింది. ఈ క్లాసుల వల్ల అందరు కూడా పాసయ్యి చాలా మంచి మార్కులను పొందుతారని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: