మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబి ఎఫ్ఐఆర్, కోర్టు స్టే తదితరాల తర్వాత మొదలైన రాజకీయ పరిణామాలతో ఎల్లోబ్యాచ్ కు దిక్కుతోస్తున్నట్లు లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని కేంద్రం అడ్డుకుంటుందని, అడ్డుకోవాలని చంద్రబాబు కోరుకున్నాడు. కానీ అనుకున్నట్లు జరగలేదు. అలాగే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబి విచారణను హైకోర్టు అడ్డుకున్న విధానంపై జాతీయస్ధాయిలో జ్యుడిషియరీ బాగా వివాదాస్పదమైంది. దాంతో చంద్రబాబు+ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. ఏసిబి విచారణపై హైకోర్టు బ్యాన్ పెట్టగానే అంత అయిపోయినట్లే అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా దేశంలోని అన్నీ వైపుల నుండి ఆరోపణలు, విమర్శలు మొదలవ్వటంతో దాన్ని న్యాయవ్యవస్ధను ఎలా సమర్ధించాలో చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాకు కూడా అర్ధంకాలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజధాని అంశంపై మొదటి నుండి కేంద్రం తన వాదనను స్పష్టంగానే వినిపిస్తోంది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశమే అని కేంద్రం మొదటినుండి చెబుతున్నా చంద్రబాబు+ఎల్లోబ్యాచ్ వినిపించుకోవటం లేదు. రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి రాదన్నపుడు ఇక పార్లమెంటు పరిధిలోకి మాత్రం ఎలావస్తుందని చంద్రబాబు వాదిస్తున్నాడో ఎవరికి అర్ధం కావటంలేదు. చంద్రబాబు వాదనలో క్లారిటి లేకపోయినా కేంద్రం అఫిడవిట్ మాత్రం స్పష్టంగానే ఉంది. ఆర్టికల్ 248 ప్రకారం వివాదంలో జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటూ పదే పదే డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది.
నిజానికి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడు కూడా అప్పట్లో కేంద్రం నుండి అనుమతి తీసుకోలేదు, కేంద్రమూ పట్టించుకోలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అమరావతి అనే రాజధాని చంద్రబాబు నిర్ణయం వల్ల ఏర్పడిందే కానీ పార్లమెంటు ఆమోదంతో ఏర్పడింది కాదు. అలాగే అమరావతిలో హైకోర్టు కూడా ఇదే విధంగా ఏర్పాటయ్యిందే కానీ పార్లమెంటుకు ఎటువంటి సంబంధం లేదు. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని కేంద్రానికి చంద్రబాబు తెలియజేశాడంతే. తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. రాజధాని అంశంలో తాను ఆశించినట్లుగా కేంద్రం స్పందించటం లేదన్న అసహనంతోనే చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న విషయం తెలిసిపోతోంది.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చరిత్రను తప్పుదోవ పట్టిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. రాజధాని నిర్ణయంపై కేంద్రం శివరామకృష్ణన్ కమిటిని వేసిందని చెప్పటం తప్పు. శివరామకృష్ణన్ తో కేంద్రం ఎందుకు కమిటి వేసిందంటే రాజధానిగా ఎంపిక చేసుకోవటానికి ఏ ప్రాంతానికి అవకాశం ఉంది ? ఆ ప్రాంతానికున్న ప్లస్సులేంటి, మైనస్సులేంటి అనే విషయాలపై అధ్యయనం చేయటానికి మాత్రమే. పోని చంద్రబాబు చెప్పిందే నిజమని అనుకున్నా కేంద్రం నియమిచింన కమిటి నివేదికను ఏమన్నా అమలు చేశాడా ? శివరామకృష్ణన్ కమిటి గురించి ఇపుడు మాట్లాడుతున్న చంద్రబాబు మరి తాను అధికారంలోకి రాగానే పొంగూరు నారాయణతో మరో కమిటి ఎందుకేశాడు ?నారాయణ కమిటి ఇచ్చిన రిపోర్టునే కదా చివరకు చంద్రబాబు అమలు చేసింది.
అంటే తన ఆలోచనలనే చంద్రబాబు నారాయణ కమిటికి చెప్పి తనకు కావాల్సినట్లుగా నివేదిక తెప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే నారాయణ కమిటిలో ఉన్న సభ్యులంతా కేవలం వ్యాపారస్తులు+చంద్రబాబుకు కావాల్సిన వారే. కాబట్టే తాను అనుకున్నట్లే కమిటితో రిపోర్టు తెప్పించుకున్నాడు. అదే శివరామకృష్ణన్ తో ఆ పద్దతి సాధ్యంకాదు. అందుకనే కమిటి రిపోర్టును మూలపడేశాడు. గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య అసలు రాజధానిని ఏర్పాటు చేయొద్దని శివరామకృష్ణన్ కమిటి స్పష్టంగా చెప్పినా చంద్రబాబు ఏమి చేశాడు ? అంటే తాను అధికారంలో ఉంటే అంతా తనిష్టం వచ్చినట్లు చంద్రబాబు చేసుకుపోయాడన్నది స్పష్టం.
విద్యుత్ కొనుగోళ్ళ విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్నట్లే రైతుల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని చంద్రబాబు డిమాండ్ చేయటంలోనే తన అసహనం తెలిసిపోతోంది. విద్యుత్ అంశం అన్నది కేంద్ర-రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్నది కాబట్టే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంది. కానీ రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమే అని కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు వినిపించుకోవటం లేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను అధికారంలో ఉంటే మాత్రం తన నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదని చంద్రబాబు అనుకుంటాడు. అదే ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం రాష్ట్రప్రభుత్వ నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవాలని పదే పదే కోరుకుంటుంటాడు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఘటనలపై సిబిఐ విచారణను కోరుతున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నపుడు ఇదే సిబిఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులిచ్చిన విషయం చంద్రబాబు వైఖరిని స్పష్టం చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి