బంగారం కోనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గత రోజులుగా పసిడి ధరలు దిగివస్తున్నాయి. మార్కెట్లో బంగారం ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. దీంతో ఇన్ని రోజులుగా బంగారాన్ని కోనాలని వేచి చూస్తున్నవారికి ఇది సరైన అవకాశంమని చెప్పుకోవచ్చు. అటు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  ఈ రోజు కూడా ధరలు పూర్తిగా కిందకు వచ్చాయి.


ఇది నిజంగా పసిడి ప్రేమికులకు శుభవార్త.బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. అసలు విషయానికొస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గింది. దీంతో రేటు రూ.47,350కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.350 తగ్గుదలతో రూ.43,400కు పడిపోయింది. ఇక వెండి ధర కేజీకి రూ.600 పెరిగింది. దీంతో రేటు రూ.75,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ప్రధాన కారణం గా చెప్పవచ్చు..


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.26 శాతం తగ్గుదలతో 1770 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర దిగివస్తే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.28 శాతం క్షీణతతో 27.56 డాలర్లకు తగ్గింది.. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరి రేపు మార్కెట్ లో ధర ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: