ముఖ్యంగా ఇటీవల కాలంలో బరువు తగ్గడం అయితే కష్టం. కానీ బరువు పెరగడం చాలా సులభం. అయితే తీసుకునే తిండిపై కాస్త జాగ్రత్త, శ్రద్ధ పెడితే చాలు. తొందరగా బరువు పెరగడమే కాకుండా చూడ చక్కని శరీరాన్ని పెంచుకోవచ్చు . అయితే హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ప్రతిరోజూ ఉదయాన్ని నీటిలో నానబెట్టిన బాదం పప్పులను , నాలుగు నుంచి ఐదు వరకు తినడం మంచిద. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందడమే కాకుండా శారీరక అభివృద్ధి కూడా చెందుతుంది.
ఇక కొబ్బరి పాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఇందులో మినరల్స్, విటమిన్స్ తోపాటు క్యాలరీలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనం తినే భోజనం లో కొబ్బరిపాలను చేర్చుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
కోడి గుడ్డు మంచి పోషకాహారం. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, విటమిన్ డి, విటమిన్ ఏ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని ప్రతి రోజూ తినడం వల్ల మీ శరీరంలో మంచి మార్పు కనబడుతుంది.
ఇక వీటితో పాటు ప్రతిరోజు అరటి పండ్లు, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.