మెంతికూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.మధుమేహంలో మెంతి నీరు  చాలా విధాలుగా మేలు చేస్తుంది. ఇందుకోసం మెంతికూరను రాత్రంతా వేడి నీటిలో నానబెట్టి వడగట్టి ఉదయాన్నే తాగాలి. కావాలంటే మెంతికూరను నీళ్లలో మరిగించిన తర్వాత ఆ నీటిని చల్లార్చి తాగవచ్చు.మీరు మెంతులతోపాటు దీని ప్రభావాన్ని పెంచాలనుకుంటే, అనేక ఇతర మసాలా దినుసులను ఇందులో కలపవచ్చు. ఇందుకోసం మెంతి గింజలను మెత్తగా రుబ్బుకుని దాని పొడిని తయారు చేసి అందులో ఉసిరి పొడి, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక చెంచాలో తీసుకుని ప్రతిరోజూ మూడుసార్లు తినాలి.మెంతి ఆకుల ద్వారా ఆహార సువాసన పెరుగుతుంది. పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లిన్, కాపర్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది మధుమేహానికి వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.మీకు కావాలంటే, మీరు మెంతి గింజలను కూడా ఉపయోగించవచ్చు.


ఇది డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు.మన చక్కెర స్థాయిలు పెరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండాలి.. కొద్దిపాటి అజాగ్రత్తగా వ్యవహరించిన ప్రాణాంతకం కావొచ్చు.. ఎందుకంటే ఇది మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితులలో, రోగులు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించగల ఆహారాన్ని ఎంచుకోవాలి. డయాబెటిస్ నిర్ధారణ అయిన వారు.. వ్యాయామాలు చేయడంతోపాటు..తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టాలి.. మంచి జీవనశైలిని అవలంభించాలి.. అయితే, డయాబెటిక్ రోగులకు మెంతులు లేదా మెంతికూర తీసుకోవడం చాలా ప్రయోజనకరమని, ఇంకా రైతాలో మెంతి ఆకులను కలిపి తీసుకుంటే ఇంకా మేలని నిపుణులు సూచిస్తున్నారు. మెంతులు లేదా మెంతికూర డయాబెటిస్ రోగులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది కావున ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: