కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములను ప్రజల కోసం ప్రవేశ పెడుతూనే ఉంది.ముఖ్యంగా ప్రజల అవసరాలను దృష్టి సరికొత్త పథకాలను సైతం ప్రవేశపెడుతూనే ఉంది ముఖ్యంగా ఆడపిల్లలకు సైతం సుకన్య సమృద్ధి యోజన పథకం వంటివి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ ఆడపిల్లల చదువు విషయంపై కానీ పెళ్లి విషయానికి గాని బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నెల నెల తక్కువ మొత్తంలో నైనా ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. రోజు రోజుకి ఈ స్కీంకు మరింత డిమాండ్ పెరిగిపోతూనే ఉంది.

ఈ పథకంలో ఆడపిల్లలకు 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఇక ఆ అకౌంటు హోల్డర్ కు 18 ఏళ్లు వయసు వచ్చేసరికి అమౌంట్ లో 50 శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఆ తర్వాత 21  ఏళ్లు వచ్చేసరికి మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చుట. స్మాల్ సేవింగ్ స్కీములో మంచి పదకాలలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఈ స్కీమ్ లో 8 శాతం పెట్టుబడి వస్తుంది ఇక పోతే ప్రతి త్రైమాసికానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు ఈ పథకం గరిష్టంగా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకు అవకాశం ఉంటుందట.


ఒకవేళ పాప పుట్టిన వెంటనే ఈ సుకన్య సమృద్ధిలో చేరితే 15 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది.. అంటే పాపకు 14 ఏళ్లు వచ్చేసరికి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా.. రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు కనీసం మీ ఇష్టం ఉన్నంతవరకు కట్టుకోవచ్చు. ఈ పథకంలో రూ .5000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ .25 లక్షల రూపాయల వరకు పొందవచ్చట. ఏడాదికి 60 వెలు కడితే మొత్తం 15 ఏళ్లకు.. రూ.9 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 21 ఏళ్లు వచ్చేసరికి మొత్తం 25 లక్షల రూపాయలు అందుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: