మాస్ మహారాజ రవితేజ తో కొన్నేళ్ల క్రితం రమేష్ వర్మ తీసిన సినిమా వీర. తాప్సి, అలానే కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ మాస్, యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో మంజుల కూతురు శ్రీదేవి ఒక కీలక పాత్ర చేసింది. అయితే అప్పట్లో ఎన్నో అంచనాల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక మళ్ళి చాలా సంవత్సరాల తరువాత మరొక్కసారి రమేష్ వర్మకు ఛాన్స్ ఇచ్చారు రవితేజ. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న మాస్, యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ఖిలాడీ.

డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ మూవీ ని పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ ఎల్ ఎల్ పి సంస్థలు ఈ మూవీ ని ఎంతో భారీ రేంజ్ లో నిర్మిస్తుండగా రవితేజ ఇందులో డయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అలానే రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇష్టం సాంగ్ అన్ని కూడా ప్రేక్షకులు, అభిమానులను ఎంతో అలరించి మూవీ పై ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి. రవితేజ తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ రోల్ ని ఇందులో చేస్తున్నారని, ఆద్యంతం తమ సినిమా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మంచి సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు టాక్.

ఇక ఈ సినిమాపై మాస్ రాజా ఫ్యాన్స్ లో కూడా మంచి నమ్మకాలు ఉన్నాయి. అలానే ముఖ్యంగా సినిమాని రవితేజ ఇమేజ్ కి తగ్గట్లుగా అలానే తన మార్క్ స్టైల్ యాక్షన్, కమర్షియల్ హంగులతో దర్శకుడు రమేష్ వర్మ దీనిని ఎంతో భారీగా తీస్తున్నారని, గతంలో తామిద్దరి కలయికలో వచ్చిన వీర మాదిరిగా కాకుండా తప్పకుండా ఈ ఖిలాడీ సక్సెస్ కొట్టి తమ కాంబినేషన్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టడం ఖాయం అని రమేష్ వర్మ అంటున్నారట. కాగా ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: