బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఏం చేసినా కూడా అది సంచలనమే అవుతుంది. ముఖ్యంగా ఆలియా భట్ నటించిన గంగూభాయ్ కథియావాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఆ పాత్రలో నటించిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అంతేకాదు అద్భుతమైన నటన అంటూ ఏకంగా బాలీవుడ్ బిగ్ బీ కూడా మెచ్చుకోవడం గమనార్హం. ఆలియా భట్ నటనను మెచ్చిన ఆయన స్వయంగా ఆమెను పొగుడుతూ ట్వీట్ చేయడంతో అదికాస్తా మొన్నటివరకు వైరల్ గా మారిన విషయం తెలిసిందే..


ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన ప్రియుడు రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్నారు . ఇకపోతే రణబీర్ కపూర్ మొన్నటి వరకు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న యానిమల్ సినిమా షూటింగ్ లో పాల్గొని షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వంలో ఒక సినిమాలో పాల్గొంటున్నారు. ఇక ఇందులో ఆలియాభట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ తాజాగా  ఎయిర్ పోర్ట్ లో జరిగింది. ఇక పబ్లిక్ గా ఆలియాభట్ ఎయిర్ పోర్టు లో పరుగులు పెడుతూ కనిపించడంతో అక్కడున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.. స్టార్ హీరోయిన్ ఎందుకలా పరిగెడుతుందో చూసి షాక్ తిన్నారు.


అయితే అదంతా కేవలం సినిమా షూటింగులో భాగమే అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా హీరోయిన్ ప్రస్తుతం టాప్ స్టార్ అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు ఈమె నటిస్తున్న కారణంగా ఈ సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే కరణ్ జోహార్ దర్శకత్వంలో ఇటీవల కాలంలో ఏ ఒక్క సినిమా కూడా రాలేదు. ఆయన కేవలం నిర్మాణ వ్యవహారాలు మాత్రమే చూసేవారు. ప్రస్తుతం మళ్లీ రణబీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చే ఏడాది కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: