టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం టాప్ స్టార్స్ గా కొనసాగుతున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరూ హీరోల కంటే ఒకింత ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో పవన్, అనంతరం రాజకుమారుడు మూవీతో మహేష్ టాలీవుడ్ కి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమ తొలి సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్నారు.

ఇక అక్కడి నుండి తమ కెరీర్ పరంగా వరుసగా అవకాశాలతో దూసుకెళ్లిన ఈ ఇద్దరు స్టార్లు, వచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకుని కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలతో ఎందరో కోట్లాది ప్రేక్షకాభిమానుల ప్రేమతో ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా కొనసాగుతున్నారు. ఇటీవల భీమ్లా నాయక్ తో పవన్, అలానే సర్కారు వారి పాట తో మహేష్ ఇద్దరూ కూడా మంచి సక్సెస్ లు కొట్టి ప్రస్తుతం తమ తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల నిర్మాతగా కూడా మారిన మహేష్ బాబు తొలిసారిగా అడివి శేష్ హీరోగా మేజర్ మూవీ ని సోనీ పిక్చర్స్ వారితో కలిసి ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ముంబై ఉగ్రదాడుల్లో అసువులు బాసిన భారత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కినె మేజర్ మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ కొట్టి ప్రస్తుతం ముందుకు నడుస్తోంది.

మరోవైపు పలువురు ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు సైతం మేజర్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక నేడు కొద్దిసేపటి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన జనసేన పార్టీ తరపున మేజర్ మూవీ సూపర్ సక్సెస్ పై ఒక ప్రకటనా విడుదల చేసారు. సినిమా ఎంతో అద్భుతంగా ఉందని, సందీప్ గారి పాత్రలో అడివి శేష్ అదరగొట్టారని, ఇటువంటి గొప్ప సినిమా తీసిన హీరో మహేష్ కి ప్రత్యేకంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపారు పవన్. అనంతరం మహేష్ బాబు కూడా సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కి ఆయన టీమ్ కి కృతజ్ఞతలు తెలియ చేస్తూ పోస్టులుపెట్టారు . మొత్తంగా అటు పవన్, ఇటు మహేష్ ఇద్దరూ కూడా ఈ విధంగా ఒకరికి ఒకరు అనేలా వ్యవహరిస్తుండడం టాలీవుడ్ లో ఆరోగ్యకరమైన పోటీకి నిదర్శనం అని అంటున్నారు విశ్లేషకులు.    

మరింత సమాచారం తెలుసుకోండి: