ఎంత విసిగించినా సరే ఓపికగా సమాధానం చెప్పడం మెగాస్టార్ చిరంజీవికి ఉన్న మంచి అలవాటు.ఎప్పరడో ఒక్కసారి ఆయనలో  మనం కోపంచూస్తుంటాము. లోపల కోపం ఉన్నా..

పబ్లిక్ గా మాద్రం దాన్ని  ఎప్పుడు ప్రదర్శిచరు చిరంజీవి గారు అయితే ఈసారి మాత్రం కోపం కట్టలు తెంచుకుంది. ఆపుకోలేకపోయారు. అది కూడా ఎవరి మీద అంటే మీడియా మీద. ఆయనకు మీడియా మీద బాగా కోపం వచ్చింది. నిన్న హైదరాబాద్‌ లో గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే..ఈ గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మీడియా పై చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియా అందరికి సహాయం చేయాల్సింది పోయి.. తమ కాన్ఫిడెంట్ తగ్గించేలా పని చేస్తున్నారని ఇలా వస్తున్న వార్తలు చిరాకు కలిగిస్తున్నాయని మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు. అంతే కాదు తామేం చేయాలో కూడా మీడియా నే నిర్ణయిస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. అయితే ఇదంతా గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే అని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్షం పడినప్పటికీ స్పీచ్ కొనసాగించారు మెగాస్టార్ ఈవిషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు.


ఒకవేళ తాను అలా స్పీచ్ ఇవ్వకపోతే మీడియా మరోలా వార్తలు రాసి కంపు చేసేదని, తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా మీడియా వ్యవహరించడం దారుణం అన్నారు. తమకు సహాచం చేయాల్సిందిపోయి ఇలా చేస్తుంటే తాము ఏం చేయాలంటూ విరుచుకు పడ్డారు. ఫస్ట్ టైమ్ చిరంజీవి ఇలా మాట్లాడటంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఈ మధ్య మెగాస్టార్ ఎక్కువగా మీడియాలో నానుతున్నారు. రీసెంట్ గా దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కూడా గరికపాటితో చిన్న వివాదం చెలరేగింది. అది వారిద్దరి మధ్య ఏం లేదు. ఇద్దరు స్నేహంగానే ఉన్నారు. కాని సోషల్ మీడియాతో పాటు మెగా ఫ్యాన్స ఈ విషయాన్ని కంపు కంపు చేశారు.

ఇక అభిమానులు గాడ్ ఫాదర్ను ఇంతటి విజయవంతం చేసిన అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కంటెంట్ లో దమ్ముంటే ఆడియెన్స్ తప్పకుండా సినిమాను విజయవంతం చేస్తారని నేనెప్పుడూ నమ్ముతాను. అదే తరహాలో ఈ చిత్రాన్ని తీసుకొచ్చాం. అన్నుకున్నట్టుుగానే ప్రేక్షకులు మూవీని ఆదరించడం  చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో యంగ్ యాక్టర్స్ తో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉందన్నారు. నయా జోష్ నిండిందని తెలిపారు. యంగ్ టాలెంట్స్ తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది అన్నారు చిరు.

మరింత సమాచారం తెలుసుకోండి: