ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్ల హీరోల వ్యవహారంలో పలు రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉన్నాయి. ఏదైనా కాస్త ఇన్ఫర్మేషన్ దొరికితే చాలు ఉన్నది లేనిది రాస్తూ ఉంటున్నారు.
ఇక ఆ మధ్య వర్షిణి, విష్ణు ప్రియ, రష్మి, త్రిష తదితర హీరోయిన్ల పెళ్లి రూమర్స్ బాగానే వినిపించాయి.అయితే ఇప్పుడు తాజాగా యువ హీరోయిన్ వర్ష బోల్లమ్మ వివాహం చేసుకోబోతోందనే వార్తలు చాలా వైరల్ గా మారు తున్నాయి. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తమిళంలో చాలా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో విజిల్ సినిమాతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ తదితర నటించి మంచి బ్రేక్ అం దుకుంది. చూసి చూడంగానే అనే చిత్రంతో మొదటిసారిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది వర్ష బోల్లమ్మ. ఇక తాజాగా స్వాతిముత్యం అనే సినిమాతో మంచి విజ యాన్ని అందుకుంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లం కొండ గణేష్ కు జోడిగా నటించింది. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఒక బడా ఫ్యామిలీకి కోడలుగా కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

వర్ష బోల్లమ్మ చాలా అందం అభినయంతో కలిగి ఉంటుందని చెప్పవచ్చు.. అందు చేతనే స్క్రీన్ పైన ఈమె ను చూసిన ఒక స్టార్ ప్రొడ్యూసర్ తనని కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతని కొడుకు కూడా వర్ష అందానికి ఆమె వ్యక్తిత్వానికి ఫిదా అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వర్ష ఫ్యామి లీతో కూడా అందుకు సంబం ధించి చర్చలు జరుపుతూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నిశ్చితార్థం చేసుకొని.. వచ్చే ఏడాది వివాహం చేసుకోవాలనే నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: