విశ్వ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కమలహాసన్. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు ,తమిళ భాషల్లో వరుస సినిమాలలో చేసి స్టార్ హీరోగా వెలిగాడు ఆయన నటించిన స్వాతిముత్యం సాగర సంగమం వంటి సినిమాలు ఎన్నటికీ మరువలేనివి. అంత గొప్ప స్టార్ హీరో ఎలాంటి సన్నివేశాన్ని అయినా సరే ఈగో లేకుండా నటిస్తారు.నేను ఒక స్టార్ హీరో అని ఇలాంటి పని నేను చేయను అని ఎప్పుడూ ఆలోచించకుండా ఎలాంటి పంతానికి పోకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా సులువుగా చేస్తారు కమలహాసన్. 

అందుకే ఆయన విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చాలామంది స్టార్ హీరోలు కొన్ని కొన్ని సన్నివేశాలు షూట్ చేసే టైంలో మేము పెద్ద స్టార్ హీరోలమని అలాంటి పని మేము చేయమని ఆ పాత్రలో మేము నటించమని చెబుతూ ఉంటారు. స్టార్ హీరోలో కొన్ని కొన్ని సార్లు ఈగోలకు పోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ కొందరు స్టార్ హీరో మరియు హీరోయిన్లు మాత్రం సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందు వస్తారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కమలహాసన్ నటించిన ఒక సన్నివేశాన్ని గురించి మనం మాట్లాడదాం ..అయితే కమల్ హాసన్ హీరోగా నటించిన సాగర సంగమం సినిమాలో ఆ సినిమా డైరెక్టర్ కమల్ హాసన్ కి ఒక సన్నివేశాన్ని చెప్పడం జరిగింది.

ఇక ఆ సినిమాలో కమల్ హాసన్ కి తల్లిగా నటించిన జానకి కాళ్లు పట్టుకొని కమలహాసన్ ఏడవాలి. ఇక ఆ సీన్ ని కమలహాసన్ తో చెప్పడానికి డైరెక్టర్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ ధైర్యం చేసుకొని కమలహాసన్ కి విషయం చెప్పాడు.. దీంతో కమలహాసన్ పోకుండా ఆ సినిమాలో తన తల్లిగా చేసిన జానకి చనిపోతే ఆమె కాళ్లు పట్టుకొని ఏడ్చిన సన్నివేశాన్ని మనం చూస్తాం. అయితే ఈ సన్నివేశాన్ని చూసిన చాలా మంది అప్పట్లో ఒక పెద్ద స్టార్ హీరో అయి ఉండి కాళ్లు పట్టుకుంటాడా ఇలా చేయడం చాలా కష్టం అంటూ కమలహాసన్ని పొగడారు. దీంతో ఆ సినిమా డైరెక్టర్ చాలా సంతోషించారు. అంతే కాదు కమల్ హాసన్ నటించిన ఏ సినిమాలో కూడా ఆ సినిమా డైరెక్టర్ ను ఇబ్బంది పెట్టడట కమలహాసన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: