ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత భారీ అంచనాలు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ పై ఉన్నాయి. 4 వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ పాన్ వరల్డ్ మూవీ అంటూ స్వయంగా ఈమూవీ నిర్మాతలు ప్రమోట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ప్రభాస్ తో కలిసి నటిస్తున్న ఈమూవీ హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది.



టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈసినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. భూగ్రహం నుండి మరొక గ్రహంకు టైమ్ ట్రావెల్ ద్వారా వెళ్ళడం ఈసినిమా మూల కథ అని అంటున్నారు. వాస్తవానికి ఇదే కథతో హాలీవుడ్ లో ‘ఎలిసియం’ అన్న మూవీ వచ్చింది. 2013 లో వచ్చిన ‘ఎలిసియం’ 150 సంవత్సరాల తర్వాత భూ గ్రహం ఎలా ఉంటుంది తదుపరి పరిణామాలతో వేరే గ్రహంకు ఎందుకు వెళ్ళారు అన్న కథతో ఈమూవీని అప్పట్లో నిర్మించారు.



150 సంవత్సరాల తర్వాత మనం నివసించే భూ గ్రహం ఎలా ఉంటుంది అన్న ఊహతో నిర్మించిన కథ ఇది. ఈ కథకు మన సినిమా ప్రేక్షకుల అభిరుచి రీత్యా మార్పులు చేర్పులు చాల చేసి ఈమూవీని ప్రభాస్ తో తీస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఈమూవీ దర్శక నిర్మాతలు ఇప్పటికి కూడ ఖండించక పోవడంతో నిజంగానే ఈమూవీ ఈ హాలీవుడ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ అవుతుందా అన్నసందేహాలు వస్తున్నాయి.



ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ మహానటి తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈమూవీ పై విపరీతంగా అంచనాలు ఉన్నాయి. ఈమూవీ బిజినెస్ 1000 కోట్ల స్థాయిలో జరుగుతుంది అని వస్తున్న వార్తలను బట్టి ఈసినిమా రేంజ్ మనకు అర్థం అవుతుంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈమూవీ దేశవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: