సాధారణంగా పోస్ట్ ఆఫీస్ రంగాలు ఎప్పటికప్పుడు, ప్రజల కోసం సరికొత్త స్కీం లను అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటాయి. ప్రతినెల ప్రతిరోజు కొంత మొత్తంలో డబ్బు పెట్టుబడిగా పెట్టి , కొన్నేళ్ళ తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్ సహా, మొత్తం అందుకునే ప్లాన్ భవిష్యత్తుకు బాటలు వేయడం జరుగుతుంది .. చాలామంది చిన్న మొత్తంలో పెట్టుబడి పెడుతూ, ఒకేసారి పెద్ద మొత్తం తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు.. మరీ ముఖ్యంగా పోస్టాఫీసులలో ఎలాంటి నష్టం లేకుండా ఫుల్ సెక్యూర్ గా మన డబ్బును అధిక మొత్తంలో పొందవచ్చు.. అయితే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన స్కీమ్ గురించి తెలుసుకుందాం..


గ్రామ్ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. మనీ బ్యాక్ తో పాటు ఇన్సూరెన్స్ లను కూడా పొందే స్కీమ్ ఇది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో రోజుకు 95 రూపాయలు పెట్టుబడిగా పెడితే, స్కీమ్ ముగిసేసరికి మీ చేతికి 14 లక్షల రూపాయలు వస్తాయి. గ్రామ్ సుమంగళీ యోజన స్కీమ్ బీమా పాలసీ కింద రూ. పది లక్షల వరకు అందుకోవచ్చు. మెచ్యూరిటీ తరువాత జీవించి ఉంటే పాలసీదారుకు మనీ బ్యాక్ ప్రయోజనం కూడా ఉంది. అనుకోని పరిస్థితులలో పాలసీదారుడు మరణిస్తే, నామినీకి మెచ్యూరిటీ అనంతరం అష్యూర్డ్ మొత్తం తో పాటు బోనస్ కూడా లభిస్తుంది..


ఇక ఇందులో 25 సంవత్సరాల వయసు కలిగిన వారు కనుక ఈ పాలసీని 20 సంవత్సరాల వరకు తీసుకుంటే, రూ. 7 లక్షల అష్యూర్డ్ మనీ లభిస్తుంది. ఈ పాలసీ కింద రోజుకు 95 రూపాయలు,  నెలకు 2,853 రూపాయలు, క్వార్టర్లీ ప్రీమియం రూ.8,449,  ఆరు నెలల ప్రీమియం 16,715 రూపాయలు, ఒక సంవత్సర ప్రీమియం రూ 32,735 గా ఉంది.


ఇందులో 20 సంవత్సరాల  పాలసీ తీసుకుంటే, ఎనిమిదేళ్లు, పన్నెండేళ్ళు, పదహారేళ్ల పూర్తయ్యాకరూ.1.4 లక్షల చొప్పున మనీ బ్యాక్ వస్తుంది. 20 సంవత్సరాల మెచ్యూరిటీ అనంతరం మిగతా 2.8 లక్షలు వస్తాయి.  ఇక ప్రతి వెయ్యి రూపాయలకు ఏడాదికి 48 రూపాయల బోనస్ లభిస్తుంది. ఇక రూ.ఏడు లక్షల  అష్యూర్డ్ మొత్తంపై సంవత్సరానికి బోనస్ రూ.33,600 లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీ రూ.6.72 లక్షలు అవుతుంది. అంటే మొత్తం పాలసీదారునికి రూ.13.72 లక్షల మేర లబ్ధి చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: