టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నీతోడు కావాలి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ ఛార్మి కౌర్. అయితే తొలి సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, తన అందం, అభినయంతో ఛార్మి ప్రేక్షకుల మదిని దోచింది. ఆ తరువాత ఒక ఏడాది గ్యాప్ తీసుకుని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీఆంజనేయం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఛార్మి, ఆ సినిమా తో కూడా సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఆ తరువాత నాగార్జున తో నటించిన మాస్, ప్రభాస్ తో నటించిన చక్రం, అనుకోకుండా ఒక రోజు, వెంకటేష్ తో చేసిన లక్ష్మి సినిమాలు ఛార్మికి మంచి పేరుని తీసుకువచ్చాయి. 

 

ఆపై లేడీ ఓరియెంటెడ్ మూవీ మంత్ర తో మంచి హిట్ అందుకున్న ఛార్మి, ఆ తరువాత కూడా రెండు, మూడు అటువంటి సినిమాల్లోనే నటించినప్పటికీ సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని సడన్ గా నిర్మాతగా అవతారం ఎత్తిన ఛార్మి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మి సినిమాలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు ఆ సినిమాకు ఒక నిర్మాతగా పని చేసింది. ఇక అక్కడ నుండి పూర్తిగా నటనకు స్వస్తి పలికిన ఛార్మి, ఇప్పటివరకు వరుసగా పూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలన్నిటికీ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక అతి త్వరలో పూరి

 

విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కనున్న సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి, నేడు బీచ్ లో సరదాగా దిగిన ఒక ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోని చూసిన ఆమె ఫ్యాన్స్ కొందరు, మిమ్మల్ని చూస్తే అందరూ హీరోయిన్ అనే అనుకుంటారుతప్ప నిర్మాత అని ఎవరూ అనుకోరు మేడం, మా అభ్యర్ధన మన్నించి మీరు మళ్ళి సినిమాల్లో నటించాలి అని కోరుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఛార్మి పోస్ట్ చేసిన ఆ ఫోటో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: