ప్రస్తుతం భారత దేశంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ భయమే కనిపిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు ఈ ప్రాణాంతకమైన మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఇక అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కీలక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. అంతకుముందు వరకూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించింది . ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ జనజీవన మొత్తం ఆగిపోయింది. ధనవంతులకు లాక్ డౌన్ అంటే ఇంట్లో కూర్చొని హాయిగా కుటుంబంతో సమయం గడపడమే కావచ్చు కానీ ... రోజూవారీ కూలీల పరిస్థితి మాత్రం రోజుకు మరీ దారుణంగా మారిపోతుంది.
ఇక కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే. అనేది ఇండస్ట్రీలో సినిమా చిత్రీకరణలో పూర్తిగా ఆగిపోయాయి. సినీ ప్రముఖులందరూ ముందుకొచ్చి మరి కరోనా వైరస్ నియంత్రణకు మద్దతు ప్రకటిస్తూ సినిమా షూటింగులకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పేద సినీ కళాకారులు కార్మికుల జీవితాలు రోజురోజుకూ దుర్భరంగా మారిపోతున్నాయి. రోజువారి కూలి మీద ఆధారపడి బతికే వారు ప్రస్తుతం ఉపాధి కరువవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది సినీ ప్రముఖులు పేద సినీ కళాకారులు కార్మికులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా టాలీవుడ్ యువ కథా నాయకుడు అయిన సందీప్ కిషన్ కూడా పేద సినీ కళాకారులు కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల షూటింగ్ లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కళాకారుల సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి చైర్మన్గా ఏర్పాటైన కరోనా క్రైసీస్ చారిటీకి యువ హీరో సందీప్ కిషన్ మూడు లక్షలు విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా తన వివాహ భోజనంబు రెస్టారెంట్ లో పనిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగులను సైతం ఆయన చేసుకోబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో తన రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కావలసిన అవసరాలను తానే సమకూర్చనున్నట్లు తెలిపారు. ఈ వైరస్ ను నియంత్రించేందుకు మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ సందీప్ కిషన్ తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను అందరూ గౌరవించాలంటూ సందీప్ కిషన్ తెలిపారు.