హీరోలు ఎవరైనా నిర్మాతలుగా మారితే యాక్టింగ్.. ప్రొడక్షన్ తో బిజీగా ఉంటారు. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం నిర్మాతగా మారాక క్షమాపణలు చెప్పడంతోనే బిజీగా ఉంటున్నాడు. ట్విట్టర్ లో క్షమించమని లెటర్లు రాయడంతోనే సరిపోతోంది. మరి నిర్మాతగా మారి దుల్కర్ చేసిన తప్పులేంటి.. ఎవరికి అపాలజీ లెటర్స్ రాస్తున్నాడో తెలుసా.. 

 

దుల్కర్ సల్మాన్ కు సౌత్ లో మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మళయాళంలో ఈ హీరోకు భారీ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా బాలీవుడ్ కు కూడా వెళ్లాడు. మళయాళీ హార్ట్ త్రోట్ గా అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి దుల్కర్ ఇప్పుడు అపాలజీ స్టార్ గా మారుతున్నాడు. 

 

దుల్కర్ సల్మాన్ వేఫరర్ ఫిల్మ్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ స్టార్ట్ చేశాడు. ఈ బ్యానర్ లో సురేశ్ గోపీ, శోభన లీడ్ రోల్స్ లో వరానె అవశ్యముండు అనే సినిమా తీశాడు. అయితే ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చినప్పటి నుంచి రోజుకో కాంట్రవర్సీ క్రియేట్ అవుతోంది. మొన్న ఓ ముంబై జర్నలిస్ట్ తనను బాడీ షేమింగ్ చేశారని కామెంట్ చేస్తే.. ఆమెకు క్షమాపణలు చెప్పాడు. నిన్న తమిళుల నుంచి విమర్శలు వచ్చాయి.

 

వరానె అవశ్యముండు సినిమాలో దివందత ఎల్టీఈ ప్రభాకరన్ ని అవమానంచారనీ.. నిర్మాత దుల్కర్ సల్మాన్, దర్శకుడు అనూప్ పై విమర్శలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. దీంతో ఇది కావాలని చేయలేదని, ప్రభాకరన్ ట్రాక్ కు పాత మళయాళీ సినిమా పట్టన ప్రవేశమ్ రిఫరెన్స్ అని ట్వీట్ చేశాడు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండని పెద్ద లెటర్ ట్వీట్ చేశాడు దుల్కర్. మొత్తానికి దుల్కర్ సల్మాన్ క్షమాపణలతో బిజీబిజీ అయ్యాడు. పొరపాటయింది క్షమించండి అంటూ అపాలజీ స్టార్ గా మారిపోతున్నాడు. చూద్దాం ముందు ముందు ఇంకా ఎవరెవరికి క్షమాపణలు చెబుతాడో. 

మరింత సమాచారం తెలుసుకోండి: