పూరీ జగన్నాథ్ బాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్నాడు. ముంబైలో జెండా పాతడానికి భారీ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఆల్ రెడీ ఓ పాన్ ఇండియా మూవీ తీస్తున్న పూరీ జగన్నాథ్.. ఇప్పుడో క్రేజీ సిినిమాతో బీటౌన్ కు వెళ్తున్నాడు. అక్కడ సాలిడ్ ప్లేస్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 

 

పూరీ జగన్నాథ్ మళ్లీ బాలీవుడ్ కు వెళ్తున్నాడు. ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ నే ఫోకస్ చేసిన పూరీ.. ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేస్తున్నాడు. ఉత్తరాది మార్కెట్ లో సందడి చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ తో ఖాన్ తో సినిమా చేయబోతున్నాడు పూరీ జగన్నాథ్. 

 

పూరీ జగన్నాథ్ ఇంతకుముందు బాలీవుడ్ లో ఓ సినిమా చేశాడు. అమితాబ్ బచ్చన్ తో తీసిన బుడ్డా హోగా తేరా బాప్ తో బీటౌన్ లోకి వెళ్లాడు. ఈ మూవీ తర్వాత మళ్లీ హిందీలో సినిమాలు చేయలేదు పూరీ జగన్నాథ్. అయితే ఇప్పుడు వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్. 

 

పూరీ జగన్నాథ్ ఆల్ రెడీ విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. కరణ్ జోహార్ తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాడు పూరీ.  ఇక ఈ మూవీ సెట్స్ లో ఉండగానే.. సల్మాన్ ఖాన్ ను ఒకే చేసుకున్నాడు.  సో పూరీ జగన్నాథ్ లిస్ట్ చూస్తుంటే ఆ డైరెక్టర్ బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఇక నుంచి పూరీ అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే తీస్తాడా.. లేక సౌత్, నార్త్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాడా అనేది చూడాలి. 

 

మొత్తానికి పూరీ జగన్నాథ్ హిందీ ప్రేక్షకులపై ప్రత్యేక దృష్టి పెట్టాడు.  నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేసేశాడు. సల్మాన్ ఖాన్ తో మూవీ తీసి తన టాలెంట్ ఏంటో బాలీవుడ్ జనాలకు చూపించాలనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: