అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో హిట్ అందుకున్న నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు సంబందించిన ఒక సాంగ్ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. లాక్ డౌన్ వల్ల షూటింగ్ గ్యాప్ రావడంతో సినిమా వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక సెట్స్ మీద ఉన్నప్పుడే ఈ మూవీ డిజిటల్ రైట్స్ సెల్ అవడం జరిగింది. 


తెలుగు ఓటిటి ఆహా లవ్ స్టోరీ సినిమాను భారీ మొత్తానికి కొనేసిందని తెలుస్తుంది. ఈ సినిమాను 6 కోట్లకు ఆహా వాళ్లు కొన్నారని తెలుస్తుంది. ఫిదా తర్వాత సాయి పల్లవితో  శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో చైతు కూడా తన నటనతో సర్ ప్రయిజ్ చేస్తాడని అంటున్నారు. ఎలాగూ హిట్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి లవ్ స్టోరీ కూడా పక్కా హిట్టు కొడుతుందని అంచనా వేస్తున్నారు. డిజిటల్ రైట్స్ మాత్రమే కాదు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ మొత్తానికే అమ్ముడైనట్టు తెలుస్తుంది. 


లాక్ డౌన్ వల్ల సినిమాలు రిలీజ్ అవకుండా ఆపేశారు. థియేటర్లు ఓపెన్ చేయగానే వరుసగా మార్చి నుండి రిలీజ్ చేయాలని అనుకున్న సినిమాలు లైన్ లో రిలీజ్ అవుతాయి. అందులో నాని వి, రామ్ రెడ్, అనుష్క నిశ్శబ్దం సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక మిగతా సినిమాల రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. లాక్ డౌన్ వల్లే ఈ ఇయర్ రిలీజ్ అనుకున్న లవ్ స్టోరీ నెక్స్ట్ ఇయర్ కు వాయిదా వేశారని తెలుస్తుంది. మరి త్వరగా పూర్తయితే ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేస్తారేమో చూడాలి,

మరింత సమాచారం తెలుసుకోండి: