కింగ్ నాగార్జున ప్రస్తుతం కెరియర్ లో వెనుకపడ్డారని చెప్పొచ్చు. ఆఫీసర్, మన్మథుడు 2 సినిమాల ఫలితాల వల్ల డిస్ట్రబ్ అయిన నాగార్జున సోలమన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరక్టర్ ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తుందని అంటున్నారు. ఎల్బిడబల్యు, రొటీన్ లవ్ స్టోరీ, గుంటూర్ టాకీస్, గరుడవేగ సినిమాలతో సత్తా చాటిన ప్రవీణ్ సత్తారు అసలైతే గరుడవేగ సీక్వల్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసినా దానికి ఇంకా టైం ఉందని అంటున్నారు.

 

ప్రవీణ్ సత్తారు, నాగార్జున కాంబినేషన్ లో ఓ క్రేజీ మూవీ రాబోతుంది. ఆ సినిమాకు టైటిల్ గా నా రాత నేను రాసుకుంటా అని పెట్టబోతున్నారట. రైడ్ రీమేకు ఇలాటి టైటిల్ ఏంటని ఆశ్చర్యపోవచ్చు. మరి వీళ్లు తీసేది రైడ్ రీమేక్ నా లేక ప్రవీణ్ సత్తారు సొంత కథతో నాగ్ ను ఇంప్రెస్ చేశాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీలో నాగార్జున సరసన ఇలియానా నటిస్తుందని తెలుస్తుంది. కచ్చితంగా గోవా బ్యూటీ ఇల్లి బేబ్ కి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. 

 

తనయుల కెరియర్ ను సెట్ చేసే పనిలో తన కెరియర్ ట్రాక్ తప్పించుకున్న నాగార్జున ఇక మీదట మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. నా రాత నేను రాసుకుంటా టైటిల్ వింటేనే నాగ్ ఈసారి పక్కా హిట్టు కొట్టేస్తాడని అనిపిస్తుంది. వైల్డ్ డాగ్ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాతనే ప్రవీణ్ సత్తారు మూవీ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.                    

మరింత సమాచారం తెలుసుకోండి: