ప్రస్తుతం జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ అలానే కేజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాల్లో ఆదిపురుష్, సలార్ షూటింగ్స్ ఇటీవల ప్రారంభం కాగా రాధేశ్యామ్ మూవీ మాత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. రాధేశ్యామ్ లో ప్రభాస్ కి జోడీగా పూజాహెగ్డే నటిస్తుండగా యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన రెట్రో లవ్ స్టోరీ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అదిరిపోతుందని సమాచారం. ఆదిపురుష్ సినిమా విషయానికొస్తే మైథలాజికల్ మూవీగా పొందుతున్న ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దీనిని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీతగా నటిస్తుండగా ప్రతి నాయకుడైన రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న సలార్ ఇప్పటికే 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా లో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలే ఫిలిమ్స్ సంస్థ దీనిని ఎంతో భారీగా నిర్మిస్తుంది.  

అయితే ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా రెండో హీరోయిన్ ని కొద్దీరోజుల క్రితం ఎంపిక చేసిందట యూనిట్. ప్రస్తుతం తెలుగులో వరుణ్ తేజ్ సరసన గని, అలానే అడివి శేష్ తో మేజర్ మూవీస్ లో నటిస్తున్న సాయి మంజ్రేకర్ ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయిందని అలానే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు ఆగాల్సిందే..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: