టాలీవుడ్ లో దర్శకుడు మెహర్ రమేష్ కు కొంత బ్యాడ్ నేమ్ ఉంది. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ కావడమే అందుకు కారణం. దర్శకుడిగా ఆయనకు టెక్నికల్ గా మంచి పేరున్నా వాటి ఫలితాలు, కథ వంటి ఇతర అంశాలపై మెహర్ కి అంత గ్రిప్ లేదన్నది ప్రేక్షకుల మాట.. ట్రైలర్ తో, ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లే  మెహర్ రమేష్  సినిమా పరంగా చూస్తే భారీ ఫ్లాప్ లను ఎదుర్కొంటాడు.  అందుకే  ఆయనను ఐరన్ లెగ్ గా అభివర్ణిస్తారు మన టాలీవుడ్ ప్రేక్షకులు.

కంత్రి సినిమా టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేష్ తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అందుకున్నాడు. అంతకుముందు కన్నడలో ఆంధ్రావాలా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఒక్కడు సినిమా రీమేక్ కూడా కన్నడలో చేసి హిట్ కొట్టాడు. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ కంత్రి సినిమా ద్వారా మెహర్ కి ఛాన్స్ ఇస్తే నిలబెట్టుకోలేక పోయాడు మెహర్ రమేష్.  తెలుగులో ఆయన రెండవ సినిమాగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన సినిమా బిల్లా ను అదే పేరుతో తెరకెక్కించారు.  ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రభాస్ ను స్టైలిష్ గా చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు..  

ఇక మూడవ సినిమా శక్తి ద్వారా ఎన్టీఆర్ కి అయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చాడు రెండో సారి కూడా ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకో లేకపోయాడు మెహర్.. ఇక ఆ తర్వాత చేసిన సినిమా వెంకటేష్ షాడో ఆయనకు మళ్లీ ఇంకో తెలుగు సినిమా ని రానివ్వకుండా చూసుకుంది. ఇలా వరుస భారీ ప్లాప్ లతో టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాలేని సినిమాలను రూపిందించి చెడ్డ పేరు సంపాదించుకున్నారు.. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆయనను నమ్మి వేదాళం సినిమా దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఈ కొంత షూటింగ్ కోసం మెహర్ రమేష్ సినిమా లోని మొత్తం బడ్జెట్ లో సగం ఖర్చు చేశాడని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి సినిమాను ఏం చేస్తాడో అని భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: