మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియాలోనే టాప్ దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ  రామ్ చరణ్ కి కెరియర్ పరంగా 15 వ సినిమా కావడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటోంది. ఈ మూవీ లో కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , అంజలి , సునీల్మూవీ లో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ లో లో దర్శకుడు మరియు నటుడు అయి నటువంటి ఎస్ జె సూర్య ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతునట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా షెడ్యూల్ ల షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో కార్మికుల సమ్మె కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సినిమా షూటింగ్ లు అన్ని బందు అయిన విషయం మన అందరికి తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరగడం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని శంకర్ తన గత మూవీ ల మాదిరి గానే చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: