ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన శివ పార్వతి ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈమె ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపదు అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె అందులో కీలకమైన అంశాల గురించి తెలియజేయడం జరిగింది. రోజులో రూ. 5000 రూపాయలు పెట్టిన డ్రెస్ వస్తుంది రూ.500 రూపాయలు పెట్టిన కూడా డ్రస్సు వస్తుందని ఆమె తెలియజేసింది. చిన్నవాళ్లకు ఎప్పుడు కూడా చాలా హుందాగా బతకాలని కోరికలు ఉంటాయని తెలియజేసింది.



వాస్తవానికి తమకు కూడా మేకప్ మెటీరియల్స్ అవసరమని బుల్లితెర మీద నటీనటులు సైతం సినిమా స్టార్ల లాగా మారిపోతున్నారని ఆమె తెలియజేస్తోంది.  ప్రస్తుత కాలంలో నీటిగా కనిపించడమే చాలా ముఖ్యమని తెలియజేస్తోంది. చదువుతోపాటు విజ్ఞానం కూడా చాలా అవసరమని శివపార్వతి వెల్లడిస్తోంది. యువత ఎక్కువగా ఇలాంటి వాటిని కోరుకుంటున్నారని తెలిపింది. అయితే తాము ఉన్న రోజులలో ఏదైనా సందర్భాలలోనే మాత్రమే మద్యం తాగే వారిని కానీ ఇప్పుడు ఎక్కువగా యువత తాగేస్తున్నారని తెలియజేస్తుంది. ముఖ్యంగా పురుషుడు తాగితే తప్పే కానీ అదే పని చేస్తే రెట్టింపు తప్పు అని శివపార్వతి తెలియజేసింది


ఒక స్త్రీ ఎంతటి పెద్ద సమస్య నైనా తట్టుకోగలదని .. ఎంతటి పని అయినా సరే చేస్తూ ఉంటారని తెలియజేసింది. అయితే రాబోయే రోజులలో ఆడపిల్లలు ప్రపంచంలో తిరగగలరా అనే భయం కూడా ఉంటుందని ఆమె తెలియజేస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలపై వేధింపులు మహిళలపై అత్యాచారాలు వంటివి ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి ఇలాంటి వారు రాక్షసులు పశువులు అని ఆమె తెలియజేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలాంటి పనులు అయితే చేస్తారో పిల్లలు కూడా అలాంటివే చేస్తారని ఆమె తెలియజేస్తోంది. ప్రస్తుతం పలు సీరియల్స్ ద్వారా బాగానే రెమ్యూనరేషన్ అందుకుంటుంది శివ పార్వతి.

మరింత సమాచారం తెలుసుకోండి: