వివి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి ఈ మూడు సినిమాలు ఒకటి నుంచి మరొకటి విజయాన్ని అందుకున్నాయని చెప్పవచ్చు.. మొదటిసారిగా ఆది సినిమాతో దర్శకుడు గా మారిన వివి వినాయక్ ఆ తర్వాత తక్కువ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి కలెక్షన్ల వర్షాన్ని కురిపించేలా చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత వివి వినాయక్ డైరెక్షన్లో ఎంతో మంది హీరోలు నటించి కమర్షియల్ గా సక్సెస్ సాధించారు. వాటి ద్వారానే వివి వినాయక్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్ వివి వినాయక్ ఆది కాంబినేషన్ తర్వాత సాంబ సినిమా తెరకెక్కించారు. అయితే ఆ సినిమాలోని కథల లోపాల వల్ల ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.



ఆ తర్వాత వీరి కాంబినేషన్లో అదుర్స్ సినిమా రాగసినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక అదుర్స్ సినిమా సీక్వెల్ కు సంబంధించి ఎన్నో వార్తలు గతంలో కూడా ఎక్కువగా వినిపించాయి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివి వినాయక్ అదుర్స్ -2 సినిమా పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదుర్స్ సినిమా సీక్వెల్ అసలు ఉండదని తెలియజేశారు. అయితే అందుకోసం ముందుగా రెండు కథలను అయితే ఎన్టీఆర్ కి చెప్పాను అవి సరిగ్గా లేదని వివి వినాయక్ తెలియజేశారు. దీంతో అటు తారక్ కెరియర్ పరంగా అదుర్స్ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టిందని ఆ సినిమా సీక్వెల్ కోసం కొన్ని కథలు చెప్పగా ఎన్టీఆర్ కు తనకు నచ్చలేదని అందుచేతనే ఆ సినిమా సీక్వెలను తీయకుండా ఉంటేనే మంచిదని భావించామని తెలిపారు.


ఇక అదుర్స్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ  సినిమా సీక్వెల్ ను ఇక ఎప్పుడూ ఆలోచించమని కూడా తెలియజేశారు. వీధి వినాయక్ ప్రస్తుతం బాలీవుడ్ లో చత్రపతి సినిమాని రీమిక్స్ చేస్తూ ఉన్నారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: