2019 లో ఏకకాలంలో తెలుగు మరియు తమిళ భాషలలో థియేటర్ లలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా "ఖైదీ". ఇది ఒక డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఇందులో కార్తీ హీరోగా నటించగా, మిగిలిన పాత్రలలో అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, దీప్తి మరియు నారాయణన్ కీలక పాత్రలలో నటించి సినిమా విజయానికి కారణం అయ్యారు. ఈ సినిమాను అనుక్షణం అద్భుతమైన స్క్రీన్ ప్లే తో బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా మలిచిన డైరెక్టర్ లోకేష్ కనగరాజన్. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో 110 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ సినిమాతో ఒక్క సారిగా లోకేష్ కనగరాజన్ కు ఆఫర్ లు పెరిగిపోయాయి. ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ తో మరో యాక్షన్ థ్రిల్లర్ "విక్రమ్" ను తెరకెక్కించాడు. ఆల్రెడీ ఖైదీ తో అంచనాలు అందుకున్న లోకేష్సినిమా తో అదనపు బాధ్యత పడింది. అయినప్పటికీ అంతకు మించిన హిట్ ను ఈ సినిమాతో అందుకుని తనకు సాటి లేదు అంటూ నిరూపించాడు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు డైలాగులతో సోషల్ మీడియాలో రీల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక కమల హాసన్ ఈ హిట్ తో చాలా హ్యాపీ అయ్యాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ అనే పేరుతో సూర్య సరైన ముగింపునిచ్చాడు.

రోలెక్స్ టీం లో ఉన్న కీలక వ్యక్తిని విలన్ గా చూపిస్తూ ఖైదీ సీక్వెల్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట లోకేష్.
తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ దర్శకుడు, హీరో, నిర్మాత, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: