బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ ష్టాపబుల్’ సీజన్ 1కు వచ్చినంత క్రేజ్ సీజన్ 2కు రాకపోవడంతో ఆహా నిర్వాహకులు కలవర పడుతున్నట్లు టాక్. ఇలా జరగడానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. సీజన్ 2ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లోకేష్ లతో ప్రారంభించడంతో రాజకీయ ఫ్లేవర్ తో నడిచిన ఆషో అందరికీ కనెక్ట్ కాలేదు.


ఆతరువాత సిద్దు జొన్నలగడ్డ శర్వానంద్ ఆపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లు ఈషోకు అతిధులుగా వచ్చినా పెద్దగా ఓటీటీ ప్రేక్షకులు ఈ షోకు కనెక్ట్ కావడం లేదు. లేటెస్ట్ గా అల్లు అరవింద్ సురేష్ బాబు రాఘవేంద్ర రావ్ లతో బాలయ్య ఇంతర్వ్యూ చేసినా పెద్దగా రేటింగ్స్ రాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సీజన్2 లో చిరంజీవి పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ సెలెబ్రెటీలతో బాలకృష్ణ ఇంటర్వ్యూ ఉంటే బాగుంటుందని చాలామంది కోరుకున్నారు.


అయితే వాస్తవం వేరు. ఇలాంటి పరిస్థితిలలో ఈషోను ఏదోవిధంగా రక్షించాలని ఆహా నిర్వాహకులు తీవ్ర ప్రయాత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభాస్ ను ఈ షోకి అతిధిగా తీసుకురావాలని అతడితో రాయబారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఈవిషయమై తన సప్పందనను ఇంకా తెలియచేయలేదు అని అంటున్నారు. వాస్తవానికి ప్రభాస్ సినిమా ఫంక్షన్స్ కు ఛానల్స్ నిర్వహించే షోలకు అతిధిగా వచ్చే విషయంలో ఆశక్తి కనపరచడు. దీనికితోడు ప్రభాస్ పెద్ద మాటకారి కూడ కాదు.


అయితే ప్రభాస్ గురించి అతడి చిన్నతనం గురించి అతడి ఆహారపు అలవాట్ల గురించి అతడి పెళ్ళి పై వచ్చిన రూమర్స్ గురుంచి బాలకృష్ణకు అడగడానికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. మరి అలాంటి అవకాశం ప్రభాస్ బాలయ్యకు ఇవ్వగలిగితే ఆషోకు టిఆర్పి రేటింగ్స్ రికార్డు స్థాయిలో వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈషో నిజంగా జరగాలని ఆహా అభిమానులు మాత్రమే కాకుండా బాలయ్య అభిమానులు కూడ కోరుకుంటున్నారు..  





మరింత సమాచారం తెలుసుకోండి: