అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటినుండో కోరుకుంటుంది. అయితే ఇప్పుడు అనుకున్నట్టుగానే ఒక క్రేజీ మూవీ తో ఈమె ఎంట్రీ ఇవ్వాలని చూస్తోందట. అయితే ఇప్పుడు ఈమెని గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ 30వ సినిమాకి హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తనకు ఆఫర్ రాకముందే మీలి సినిమా ప్రమోషన్స్ కి హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎన్టీఆర్ తో ఆయన పక్కన  నటించే అవకాశం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను అని ఈమె చెప్పుకొచ్చింది. 

ఇక జాన్వి కపూర్ ఎన్టీఆర్ తో నటించినందుకు ఎంత క్తిగా ఉందో తెలుస్తుంది. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ ని  ఫైనల్ చేశారని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి . ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈమె తెలుగు ఎంట్రీ ఇవ్వడానికి చాలా ఆసక్తిగా ఉంది. అంతేకాదు ఎన్టీఆర్ సినిమా అనేసరికి ఈమె ఆనందానికి హద్దులు లేవు అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు కామెంట్లు సైతం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమా రానుంది.

 ఎన్టీఆర్ తో తెలుగు లో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ కచ్చితంగా ఇక్కడే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అంటూ ఆమె అభిమానులు అంటున్నారు. శ్రీదేవి కూడా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అందుకున్న తర్వాతే బాలీవుడ్ లోకి వెళ్ళింది. ఇక జాన్వీ కపూర్ మాత్రం టాలీవుడ్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసింది అని.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఈమె నటన ఎలా ఉంటుందో అని చూడడానికి వీరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా ఫైనల్ అయ్యిందా లేదా అన్న విషయం తెలియాలి అంటే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: