టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ది ఘోస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నాగార్జున కొన్ని రోజుల క్రితమే నా సామి రంగ అనే మూవీ ని ప్రారంభించాడు. ఇకపోతే ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ ... నాగార్జున సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇకపోతే ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత సంక్రాంతి కి చాలా తక్కువ సమయం ఉండడంతో అంత తక్కువ సమయంలో ఈ మూవీ పనులు అన్ని పూర్తవుతాయా అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈ మూవీ బృందం మాత్రం జట్ స్పీడ్ లో ఈ మూవీ పనులను పూర్తి చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన 50 శాతం షూటింగ్ ను ఈ మూవీ బృందం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మరో 50 శాతం షూటింగ్ ను కూడా ఫుల్ స్పీడ్ గా పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వారం ఈ మూవీ మేకర్స్ మైసూరు చుట్టు పక్కల ఈ సినిమా షూటింగ్ ను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నాగార్జున ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: