"ఉపాసన".. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి రామ్ చరణ్ భార్య . ఈమె ఏమి హీరోయిన్ కాదు . కానీ ఒక బిగ్ బడా పాన్ ఇండియా హీరోయిన్ కి మించిన రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.  ఉపాసన గురించి ఏ విధంగా నెగిటివ్ కామెంట్స్ కూడా వినపడవు.  ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోలింగ్ కి గురవ్వదు . అంత మంచి మనిషి . చేతనైతే నలుగురికి సహాయం చేస్తుంది తప్పిస్తే ఎవరికీ తెలిసి అపకారం చేయదు . అది అందరికీ తెలిసిందే . రీసెంట్గా ఉపాసన బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
 

ఈ ఇంటర్వ్యూలో ఎన్నో పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు.  ఆ విషయాలను మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ . ఈ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.." సాధారణంగా అందరూ కూడా భోజనం చేసేటప్పుడు పెరుగును లాస్ట్ లో తింటారు . కానీ నాకు ముందు నుంచి పెరుగన్నం ముందు తినడం అలవాటు.  పెళ్లి తర్వాత ఇంటికి వచ్చాక అందరం కూర్చుని లంచ్ చేస్తున్న మూమెంట్లో నేను ఫస్ట్ పెరుగు వేసుకుని తినడం స్టార్ట్ చేశాను . డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ నన్ను విచిత్రంగా చూసారు. అలాగే చూస్తూ ఉండిపోయారు .



ఆ తర్వాత మా మామయ్య గారు చెప్పారు.  మందు పప్పు వేసుకుని తినాలి .. ఆ తర్వాత కర్రీ వేసుకొని తినాలి .. ఆ తర్వాత పచ్చడి ..ఆ తర్వాత రసం .. లాస్ట్ లో పెరుగు తినాలి. అదే హెల్త్ కు మంచిది అంటూ మావయ్య వివరించారు . అప్పటినుంచి అలాగే చేస్తూ వచ్చాను. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను " అంటూ ఉపాసన తన పర్సనల్ విషయాన్నీ అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్  చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. కాగా రామ్ చరణ్ కంటే వయసులో ఉపాసన పెద్దది . ఈ విషయాన్ని ఆమె పెళ్లి టైంలో బాగా ట్రోల్ చేశారు జనాలు . కానీ ఆ తర్వాత ఉపాసన ఎంత మంచి మనిషి అని తెలుసుకొని మెల్లమెల్లగా అది మర్చిపోతూ వచ్చారు.  ఉపాసన - రామ్ చరణ్ ల అన్యోన్య దాంపత్యానికి జనాలు కూడా ఫిదా అయిపోయారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: