పాయల్ రాజ్ పుత్ ఇప్పటి వరకు హీరోయిన్ గా టాలీవుడ్ లో చేసింది ఒక్క సినిమానే. రిలీజ్ కావాల్సిన సినిమాలు లైన్లో ఉన్నాయి.  వెంకటేష్ తో వెంకిమామ,రవితేజతో డిస్కో రాజా చేస్తున్నది.  ఈ రెండు పెద్ద సినిమాలు.  పెద్ద హీరోలు కాబట్టి ఆమెపై పెద్దగా ఫోకస్ ఉన్నాడు.  దీంతో పాటు ఆర్డి ఎక్స్ లవ్ అనే సినిమా చేస్తున్నది.  ఆర్ఎక్స్ 100 తరహాలోనే ఇందులో కూడా రెచ్చిపోయి నటించేందుకు అవకాశం ఉంటుంది.  తన బోల్డ్ అందాలతో బోలెడంతమందిని మెప్పించవచ్చు.  అందుకే ఆ సినిమాను ఎంచుకుంది పాయల్.  



కాగా, మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన పాయల్ ఆర్ఎక్స్ 100 మూవీ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు  నిన్నే ఈ రీమేక్ ప్రారంభం అయ్యింది.  హీరో కార్తికేయ స్థానంలో బాలీవుడ్ లో సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.  అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో కబీర్ సింగ్ లా వచ్చి హిట్ కొట్టడంతో.. ఇదే తరహాలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.  అయితే, అర్జున్ రెడ్డి మాతృకకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్ కు దర్శకుడు కాగా, ఆర్ ఎక్స్ విషయంలో మాత్రం అలా జరగలేదు.  


బాలీవుడ్ ఆర్ఎక్స్ 100 సినిమాకు మిలన్ లుద్రియా దర్శకత్వం వహిస్తున్నారు.  పాయల్ రాజ్ పుత్ చేసిన రోల్ ను తార సుతారియా చేస్తున్నది.  తార సుతారియా మొదట కబీర్ సింగ్ లో చేయాల్సి ఉన్నది.  ఆమెనే హీరోయిన్ అనుకున్నారు.  కానీ, కబీర్ సింగ్ లో ముద్దులు ఎక్కువగా ఉండటంతో పాపం తార భయపడిందట.  ఆ ముద్దులను తట్టుకోవడం కష్టం అని చెప్పి తప్పుకుంది.  కబీర్ సింగ్ సూపర్ హిట్ అయ్యాక తప్పు తెలుసుకుందేమో..ఆర్ ఎక్స్ 100 రూపంలో వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి ఆసక్తి చూపించలేదు.  ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని చూస్తోంది.  దానికోసం గ్లామర్ ను ధారపోసేందుకు రెడీ అవుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: