టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ చాలా కాలం తర్వాత మళ్ళీ పొలిటికల్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్ తోనే నిర్మించబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.రీసెంట్ గా మొత్తం స్క్రిప్ట్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. హీరో నిర్మాత ఇద్దరు కూడా షూటింగ్ మొదలుపెట్టాలని  డిసైడ్ అయ్యారు. అయితే ఈ సినిమాలో విజయ్ ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. టైటిల్ రౌడి ట్యాగ్ హైలెట్ అయ్యే విధంగా ఉండాలని టీం వారు ఆలోచిస్తున్నారు. ఒక మంచి సోషల్ ఎలిమెంట్ తో పాటు పొలిటికల్ టచ్ ను కూడా ఈ మూవీలో గ్రాండియర్ గా చూపించబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.


అయితే గతంలో విజయ్ దేవరకొండ నోటా మూవీ ద్వారా మొదటిసారి పొలిటికల్ కథను టచ్ చేశాడు. ఆ మూవీ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా గ్రాండ్ గానే రిలీజ్ అయ్యింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అట్టర్ ప్లాప్ అయింది. ఇక మళ్ళీ చాలా రోజుల తర్వాత విజయ్ ఒక పొలిటికల్ కాన్సెప్ట్ ని టచ్ చేస్తూ ఉండడం విశేషం.దర్శకుడు రవి కిరణ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బాగా బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే 9వ తేదీన అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం  ఉంది. అయితే ఇలా రెగ్యులర్ స్టోరీస్ కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు మంచి ప్రయోగాలు చెయ్యొచ్చు కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పొలిటికల్ జోనర్లో చాలా మూవీస్ వచ్చాయి. మళ్ళీ అలాంటి రొటీన్ స్టోరీతో కాకుండా తేజ సజ్జ, అడివి శేష్, నిఖిల్ లాగా కొత్తగా ఏమైనా ట్రై చెయ్యొచ్చు కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్లాపులు సరిపోవా ఇంకా ప్లాపులు కావాలా అంటూ విజయ్ ని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: