మాజీ మంత్రి, వైసీపీ నేత సీ రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళతారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఆ అవినీతి సొమ్మును చంద్రబాబు వేరే రాష్ట్రాలకు బదలాయించారని అన్నారు. కేంద్ర సంస్థలు చంద్రబాబుపై దృష్టి పెట్టాలని రామచంద్రయ్య కోరారు. 
 
చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన ఐటీ దాడులలో ఆధారాలతో సహా దొరికిపోయారని అందువలనే చంద్రబాబు ఏమీ మాట్లాడటం లేదని అన్నారు. 2019 ఎన్నికలలో చంద్రబాబును నిజాయతీగా లేడనే ప్రజలు తిరస్కరించారని అయినా చంద్రబాబు తీరు మాత్రం మారలేదని అన్నారు. చంద్రబాబు బస్సు యాత్ర చేస్తానని చెబుతున్నారని చంద్రబాబు అలా చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. 
 
2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు ప్రస్తుతం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీపై ఎందుకు విమర్శలు చేయడం లేదో చెప్పాలని అన్నారు. దేశంలో ఆర్థిక రంగ పరిస్థితికి సంబంధించిన సమస్యలు, ఇతర సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలపై చంద్రబాబు నోరు మెదపడం లేదని అన్నారు. 
 
కొందరు కావాలనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన గురించి విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, రాష్ట్ర సమస్యల గురించి చర్చించారని కొందరు మాత్రం జగన్ ను మోదీ మందలించారని చెబుతూ ఉండటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు తన అనుకూల మీడియాతో కలిసి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రామచంద్రయ్య ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి సీ రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: