కరోనా .. ప్రజలందరూ  ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఏకం కావాలని అందరూ సూచించారు..అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.. అయితే ప్రజలు ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని సూచించారు.. కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..

 

 

 

 

 

 

 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. ఇకపోతే కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళతో  పెకలించి వేయడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. 

 

 

 

 

 

 

 

 

మనవవాళిని వణికిస్తున్న కరోనా వైరస్‌కు మందు కనిపెట్టే పనిలో ప్రపంచమంతా మునిగితేలింది. కోవిడ్ కు వ్యాక్సిన్‌ కొనుగోనేందుకు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే కరోనా మందుపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా లాంటి వ్యాధి గురించి యోగా వశిష్టంలో చెప్పారని  వెల్లడించారు. యోగా వశిష్టం అంటే... శ్రీరాముడికి వశిస్టుడు చేసిన బోధ.. అందులో 32వేల శ్లోకాలు ఉన్నాయి. అయితే అందులోని ఉత్పత్తి ప్రకరణంలోని 69 సర్గలో విశూచిక అనే వ్యాధి గురించి ఉందని గరికపాటి తెలిపారు. 

 

 

 

 

 

 

దుర్భోజనం ద్వారా వింత వ్యాధులు పుట్టుకొస్తాయని... అలాగే యుద్ధంలో ఎలాగైన గెలవాలన్న దుష్ట సంకల్పంతో కొందరు జీవాయుధాలు ప్రయోగంచాలని భావిస్తుంటారని యోగా వశిష్టంలో ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు కొన్నిసార్లు వ్యాధి లక్షణాలను గుర్తించడం కష్టమవుతుందని ... ఐతే దానికి పరిష్కారం కూడా యోగ వాశిష్టంలో చెప్పారన్నారు. మందు, మంత్రం రెండూ ఉన్నాయన్నారు.  ఐతే వ్యాధి నుంచి విముక్తి కావాలంటే చంద్ర సంబంధమైన వస్తువులు దీనికి మందుగా పనికొస్తాయని అభిప్రాయపడ్డారు.  చంద్ర సంబంధ వస్తువులతో మందు తయారు చేసే అవకాశం ఉందేమో భారతీయ తత్వ చింతనతో ఒక్కసారి ఆలోచించి... ప్రయోగం చేయాలని సూచించారు. యోగా ఆసనాలను క్రమం తప్పకుండా చేస్తే కరోనా దరిచేదని నిపుణులు అంటున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: