ఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధానికి అసలు విలువ లేకుండా పోతుంది. కష్ట సుఖాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేసిన వారు చివరికి కఠినాత్ములుగా మారిపోయి కట్టుకున్న వారి విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో భార్యాభర్తల బందంలో అనుమానం పెనుభూతం దూరి ఎన్నో దారుణ ఘటన లకు కారణం అవుతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  ఆ ఇద్దరికీ పెళ్లయి తొమ్మిదేళ్లు అవుతుంది  అయితే ఇప్పటి వరకు పిల్లలు కాలేదు  కానీ ఇటీవలే సదరు మహిళ గర్భం దాల్చింది.



 పెళ్లయిన ఇన్నాళ్ళకి  భార్య గర్భం దాల్చింది అని భర్త సంతోష పడకుండా భార్యపై అనుమానం పడటం మొదలు పెట్టాడు భర్త. ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకోవడం కారణంగానే తన భార్య గర్భం దాల్చింది అని భావించాడు.  చివరికి అనుమానం పెనుభూతంగా మారిపోయింది. నాలుగు నెలల గర్భవతి అయిన భార్యను పొలంలోకి తీసుకెళ్ళి చివరికి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నందలూరు మండలం టంగుటూరు హరిజనవాడ కు చెందిన నరసయ్య  లక్ష్మమ్మ కు  తొమ్మిది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నాటి నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.. అంతా సాఫీగా సాగిపోయింది.



 అయితే పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నప్పటికీ వీరికి పిల్లలు మాత్రం కాలేదు. అయినప్పటికీ ఎక్కడ బాధపడకుండా ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ సంసారాన్ని సాగిస్తున్నారు. కానీ ఇటీవల నాలుగు నెలల క్రితం లక్ష్మమ్మ గర్భం దాల్చింది.. అయితే ఇక భార్య గర్భవతి అని సంతోషించాల్సిన భర్త మాత్రం అనుమాన పడటం మొదలు పెట్టాడు. 9 ఏళ్ళ నుంచి రాని గర్భం ఇప్పుడు రావటం ఏంటి అంటూ అనుమానం వ్యక్తం చేశాడు.  అంతేకాదు సూటిపోటి మాటలతో భార్యతో గొడవ పడేవాడు. తాను ఏ తప్పు చేయలేదని భార్య చెప్పినప్పటికీ వినిపించుకోలేదు చివరికి వివాహేతర సంబంధాన్ని అంటగట్టి ఓ రోజు  పథకం ప్రకారం భార్యను పొలంలోకి తీసుకెళ్లి తలపై గొంతు పై దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు గా ఇంటికి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన లక్ష్మమ్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇక భర్తను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: