ఇక కొత్త ఫ్లాట్ టికెట్ల ధరల విషయానికి వస్తే...
సికింద్రాబాద్ డివిజన్ లోని అన్ని రైల్వే స్టేషన్లలో అంటే నాన్ సబర్బన్ మరియు సబర్బన్ స్టేషన్లు అన్నింటింలోనూ.... తాజాగా తగ్గించిన ఫ్లాట్ పారం టికెట్ ధర ఇక నుంచి రూ. 10 మాత్రమే ఉండనుంది.
అలాగే.. సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం ఈ ఫ్లాట్ పారం టికెట్ ధర 20 రూపాయలు ఉండనుంది. రెలు ఎక్కే మరియు దిగే సమయాల్లో ప్రయాణికులకు.. మరీ ముఖ్యంగా వృద్ధులకు మరియు దివ్యాంగులకు ఫ్లాట్ పారం టికెట్ జారీ వలన కాస్త సౌకర్యంగా ఉండనుంది. అలాగే రైల్వే స్టేషన్ వచ్చే వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. మాస్క్ లు తప్పనిసరి చేసింది దక్షిణ మధ్య రైల్వే .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి