ఈ యాక్సిడెంట్ లలో అధికంగా బైక్ యాక్సిడెంట్లు ఉండడం గమనార్హం. అతి వేగంతో బండ్లు నడపడం వలనే ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రం లో జిల్లాల వారీగా చూస్తే విశాఖలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. విశాఖలో 2,344 ప్రమాదాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ తరువాత స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. ఈ జిల్లాలో 2,192 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ కూడా అతివేగం కారణం గానే ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. కాలం విలువైనదే ప్రాణం అంతకన్నా విలువైనది. ఇది వాక్యం కాదు మన జీవితానికి మూలమైన సూత్రం. ఏ పనికైనా ఒక పది నిముషాలు లేట్ అయిపోతే కొంపలేమి మునిగిపోవు.
కానీ...వేగంగా బండి నడపడం వలన దుదృష్టవశాత్తు ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ప్రాణం తిరిగి వస్తుందా ? ఆ కుటుంబాలకు జరిగిన నష్టం వెలకట్టగలమా ? ఆ నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యమా ? ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రాణాలను కాపాడుకోండి. ఈ వార్తను ప్రతి ఒక్కరూ చదివి తమ కుటుంబం గురించి శ్రద్దగా అలోచించి వచ్చే సంవత్సరం యాక్సిడెంట్ ల రెకార్డ్ చూస్తే భారీగా తగ్గిపోవాలి. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. "అతివేగం ప్రమాదకరం"
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి