పహ‌ల్గంలో జరిగిన ఉగ్రదాడులకు భారత ప్రభుత్వం ఏం చేస్తుందా ? అని ఉత్కంఠతో ఎదురుచూసిన వారికి ఎట్టకేలకు సమాధానం దొరికేసింది. గతంలో పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. రాత్రికి రాత్రి వెళ్లి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఊహించని విధ్వంసాన్ని వారికి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఏప్రిల్ 22న పహాల్గంలో మరో భారీ ఉగ్రదాడి జరగగా అందుకు ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించాయి. ఇప్పటికే 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వాటిని నామరూపలు లేకుండా చేసిన భారత బలగాలు విజయవంతంగా తిరిగి వచ్చాయని రక్షణ శాఖ తెలిపింది. భారత బ‌ల‌గాలు చేపట్టిన ఆపరేషన్ సింధూరపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు జల్లు కురుస్తుంది.


పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై మజ్లిస్‌ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావ‌రాల పై భారత బలగాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌ను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను .. మరో పహల్గాం లాంటి దాడులు జరగకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత ప్రభుత్వం సరైన బదులు ఇచ్చింది ... మళ్ళీ ఉగ్రదాడులు జరగకుండా పాకిస్తాన్ కు కఠినమైన గుణపాఠం చెప్పాలి. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలతో పాటు వారి మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనం చేయాలి. జైహింద్ అని ఓవైసీ తన ఎక్స్ లో రాసుకొచ్చారు.


ఇటీవల ప‌హాల్గమ్ దాటిన సైతం వైసీపీ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న తాము ఈ విషయంలో మద్దతు ఇస్తామని అన్నారు. హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి .. మంత్రులు నేతలు ప్రజలతో కలిసి ప‌హ‌ల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో కూడా ఓవైసీ పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఆయ‌న భార‌త ఆర్మీ చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్ సింధూర కు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: