ఫహల్గంలో భారతదేశానికి చెందిన అమాయకమైన 26 మంది ప్రజలను ఉగ్రవాదులు చంపడంతో భారతీయులు సైతం రగిలిపోయారు.. దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం మొదలయ్యింది. చాలామంది పాకిస్తానీయులను ఇండియా నుంచి వెళ్లిపోమని భారత్ ఆదేశాలను కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఫహల్గం సంఘటన తర్వాత భారత్ ప్రతికారాంతో 100 మంది మావోయిస్టులను చంపడమే కాకుండా అక్కడ ఉగ్ర స్థావరాలను కూడా కూల్చివేసింది. ముఖ్యంగా కొంతమంది పాకిస్తాన్ సైన్యం కూడా మరణించినట్లు తెలిసిందే.. బడా టెర్రరిస్టులను కూడా అంతం చేసింది. కానీ కొంతమంది భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ కి మద్దతుగా పలుకుతూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం.



ప్రపంచంలో ఇంతకంటే నీచమైన ఉద్యమం ఎవరు చేసి ఉండరేమో.. ఇండియాలోని బెంగాలీలో లెఫ్టిస్టులు ఒక ఉద్యమం చేపట్టారు.. ఆ ఉద్యమం ఏంటో తెలుసా.. అమాయకపు పాకిస్థాన్ల మీద దాడి చేశారంటూ.. అమాయకపు పాకిస్తానీయులను చంపారంటూ ఉద్యమం చేపట్టారు.. ఉగ్రవాదులను చంపడం, పాకిస్తాన్  సైన్యాన్ని చంపడం తో అమాయకులను చంపారంటూ బెంగాలీలో ఉద్యమాన్ని చేపట్టారట. కానీ మన ప్రజలను వాళ్ళు చంపినప్పుడు , మన టూరిస్టులను చంపినప్పుడు, మన సైనికుల జవాన్లను పంపినప్పుడు ఆ తర్వాత మన మీద కాల్పులు జరిపినప్పుడు స్పందించని బెంగాల్ లెఫ్టిస్టులు.. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను పేల్చేసిన తర్వాత అమాయకులను చంపారంటూ ఉద్యమం చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.



కోల్కత్తాలో ఏకంగా అరెస్టులు కూడా జరిగాయి. ఇంతకంటే నీచమైన పరిస్థితి ప్రపంచంలో మరేది కూడా ఉండదేమో అన్నట్టుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.లెఫ్టిస్టులు ఉద్యమం చేసినప్పటికీ అధికారుల సైతం వీరిని అరెస్టు చేస్తే ఉన్న సమయంలో కూడా అమాయకపు పాకిస్తాన్ ప్రజలు అన్యాయం అయిపోతారంటూ బంద్ చేస్తున్నారు.. కానీ ఇలాంటి వాళ్ళని ఇండియాలో  ఉన్నివ్వడం తప్పు అంటూ కొంతమంది ప్రజలతో పాటు నేతలు కూడా ఇలాంటి వారందరినీ కూడా పాకిస్తాన్ కి పంపించేయాలంటు తెలియజేస్తున్నారు
.

మరింత సమాచారం తెలుసుకోండి: